Ravindra Jadeja: ఎడ్లబండిపై జడేజా విహారం.. నెట్టింట్లో వీడియో వైరల్
దక్షిణాఫ్రికా పర్యటన ముగించుకొని స్వదేశానికి చేరుకున్న భారత క్రికెటర్లు ఒకొక్కరు ఒక్కోలా ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు కుటుంబంతో గడుపుతుంటే.. మరికొందరు తమ ప్రేమికురాళ్లతో బీచ్ల వెంట తిరుగుతున్నారు. ఇంకొందరు తమకు నచ్చినట్లుగా ప్రకృతితో మమేకమయ్యారు. కాగా.. భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఎద్దుల బండిపై విహరిస్తూ తన విరామ సమయాన్ని గడుపుతున్నారు.
Also read: Ellyse Perry: మహిళ క్రికెటర్ ఎలిస్ పెర్రీ అరుదైన ఘనత.. ఏకైక ఆసీస్ క్రికెటర్ గా రికార్డ్
సౌతాఫ్రికా పర్యటన నుంచి స్వదేశానికి చేరుకున్న భారత జట్టు తదుపరి సిరీస్లో జనవరి 11 నుంచి ఆఫ్ఘనిస్తాన్తో తలపడాల్సి ఉంది. అందుకు ఇంకా నాలుగు రోజుల సమయం ఉండడంతో భారత క్రికెటర్లు ఈ తీరిక సమయాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. జడేజా తన సొంతూరు రాజ్కోట్లో ఎద్దుల బండిపై విహరిస్తున్నారు. అతను ఎద్దుల బండి నడుపుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఏమాత్రం తీరిక దొరికినా అధునాతన కార్లు, బైకులపై చక్కర్లు కొట్టే భారత క్రికెటర్లు.. ఇలా ఎద్దుల బండిపై కనిపించడం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. ఈ దృశ్యాలు చూసి కొందరు నెటిజన్లు తమ ఎద్దుల బండితో తమకున్న చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు.