Telangana: మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎన్నికలు… ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల కోటా శాసనమండలి ఉప ఎన్నిక జరుగుతోంది. జిల్లా, డివిజన్, నియోజకవర్గ కేంద్రాల్లో మొత్తం 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఓటింగ్ బ్యాలెట్ పద్ధతిలో జరుగుతోంది. పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు ముగియనుంది.
Also Read: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తో సీఎం రేవంత్రెడ్డి భేటీ
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల పరిధిలో మొత్తం 1439 మంది ఓటర్లు ఉన్నారు. జెడ్పీటీసీలు 83, ఎంపీటీసీలు 888, మున్సిపల్ కౌన్సిలర్లు, 449, ఎక్స్అఫిషియో సభ్యులు 19 మంది ఓటర్లుగా ఉన్నారు. ఇందులో బీఆర్ఎస్కు 840 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల బలం ఉంది. కాంగ్రెస్కు 450 మంది బలం ఉంది. బీజేపీ, ఇతరులు కలిసి 100 మంది వరకు ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ పోటీలో ఉన్నారు.