Gunturu Kaaram: ఏంది అట్టా చూస్తున్నావ్.. బీడీ త్రీడీలో కనపడుతుందా?
మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం. ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేస్తున్నారు. కాగా, ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన మూవీ ట్రైలర్తో పాటు, కుర్చీ మడత పెట్టి, ధమ్ మసాలా, ఓహ్ మై బేబీ, సాంగ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తాజాగా, ఈ మూవీ నుంచి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. కాసేపటి క్రితం మేకర్స్ మేకింగ్ వీడియో విడుదల చేశారు.
ALSO READ: ఫైట్స్ చేస్తూ గాయపడ్డ హీరో నితిన్.. ‘తమ్ముడు’కి మూడు వారాలు విశ్రాంతి
ఇరగదీసే రమణ దెబ్బ..
‘మేకింగ్ ఆఫ్ గుంటూరు కారం’ పేరిట ఈ వీడియో విడుదల చేయడంతో అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు. ఇందులో ఫైటింగ్ సీన్స్ చిత్రీకరణలో ఇరగదీసే రమణ దెబ్బ.. అనే సాంగ్ తో పాటు మాస్ ప్రేక్షకులకు మరింత నచ్చేలా డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఏంది అట్టా చూస్తున్నావ్.. బీడీ త్రీడీలో కనపబడుతుందా? అనే డైలాగ్ అదిరిపోయింది. ఇక ఇందులో మహేష్ కొత్త లుక్లో కనిపించారు. కాగా, హారిక & హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు.