టాలీవుడ్
Naa Saami Ranga: ఓటీటీలోకి కింగ్ నాగార్జున మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ నటుడు, కింగ్ అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ ‘నా సామి రంగ’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమిగోస్ ఫేం ఆషికా రంగనాథ్ హీరోయిన్గా నటించగా.. అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా, ఈ సినిమా ఓటీటీలోకి రానుంది.
ALSO READ: ‘యాత్ర 2’ మేకింగ్ వీడియో రిలీజ్..టీమ్ హార్డ్ వర్క్ సూపర్?
డిస్నీ+ హాట్స్టార్లో..
ఈ సినిమా ఫిబ్రవరి 17 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ దిగ్గజం డిస్నీ+ హాట్స్టార్ ఓటీటీ హక్కులు సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ఆస్కార్స్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించగా.. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాసా చిట్టూరి తెరకెక్కించారు.