టాలీవుడ్
TollyWood: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ భార్య మృతి
సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ భార్య యోగా టీచర్ రూహి అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతుండగా.. ఇటీవల హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
ALSO READ: యంగ్ హీరో పెళ్లి.. నిర్మాత దిల్ రాజు స్టెప్పులు
టాలీవుడ్ ప్రముఖుల దిగ్భ్రాంతి
సెంథిల్ కుమార్ జూన్ 2009లో రూహీని వివాహం కాగా, వీరికి ఇద్దరు సంతానం. సెంథిల్ కుమార్ సై, ఛత్రపతి, యమదొంగ, మగధీర, బాహుబలి 1, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలకు సినిమాటోగ్రాఫర్గా చేశారు. రుహీ వృత్తిరీత్యా యోగా శిక్షకురాలు. హీరోయిన్ అనుష్క శెట్టి దగ్గర చాలా కాలం పాటు పని చేసింది. ఆమె మరణ వార్త తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.