Yatra 2: యాత్ర-2 నుంచి మరో పాట రిలీజ్.. ఎప్పుడంటే!
‘యాత్ర’ సినిమాకు సీక్వెల్గా ‘యాత్ర-2’ ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మహి వి. రాఘవ్ దర్శకత్వం వహించాడు. ఇక దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో హీరో జీవా నటిస్తున్నారు. వైఎస్సార్ తనయుడు, ఏపీ సీఎం వైఎస్. జగన్మోహన్రెడ్డి ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరు, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు.
ALSO READ: ‘మ్యాజిక్’ చేయనున్న ‘జెర్సీ’ డైరెక్టర్.. ఫస్ట్ లుక్ రిలీజ్
ఆకట్టుకుంటున్న ఓదార్పు యాత్ర పోస్టర్
‘యాత్ర 2’ నుంచి తొలి సమరం అనే సెకండ్ సింగిల్ను రేపు ఉదయం 11 గంటలకు లాంఛ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందులో భాగంగా ఓదార్పు యాత్రలో ఉన్నలుక్ పోస్టర్ను విడుదల చేయగా.. ప్రస్తుతం ఆ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాగా, అంతకుముందు ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్తో పాటు టీజర్, ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు.