BJP: వచ్చే ఎన్నికల్లో బీజేపీ బలమైన శక్తిగా నిలుస్తుంది: పురందేశ్వరి
ఏపీలో ఐదేళ్లుగా దోపిడీ పాలన సాగించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈసారి ఎన్నికల్లో దొంగ ఓట్లనే నమ్ముకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ధ్వజమెత్తారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక సమయంలో ఆ పార్టీ చేసిన అక్రమాలే అందుకు నిదర్శనమన్నారు. ఒక్క తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలోనే 35 వేల నకిలీ ఓటరు కార్డులు తయారుచేశారంటే… ఇంతకంటే అన్యాయం ఉంటుందా? ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని మండిపడ్డారు.
Also Read: సీఎం రేవంత్ సవాల్ కేటీఆర్ రియాక్ట్.. దమ్ముంటే పోటీకి రావాలని కౌంటర్
కేంద్రం నిధులు ఇస్తున్నప్పటికీ, అన్నీ తామే చేస్తున్నామని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని విజయవాడలో నిర్వహించిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు, పార్టీ మీడియా ప్రతినిధుల సమావేశంలో పురందేశ్వరి పార్టీ నేతలకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ బలమైన శక్తిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
I am not sure where youre getting your info but good topic I needs to spend some time learning much more or understanding more Thanks for magnificent info I was looking for this information for my mission