AP Elections: చంద్రబాబు స్కాంల మీద 250 పేజీల పుస్తకం..స్కిల్ బిల్ పాండే!
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ బిల్ పాండే అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాజాగా, తాడేపల్లిలో ‘మహాదోపిడీ’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. చంద్రబాబు స్కాంల మీద పుస్తకం రాస్తే 250 పేజీలు వచ్చిందని, దోపిడీలు చేసిన గద్దలు ఇప్పుడు సుద్దులు చెబుతున్నాయని ఎద్దేవా చేశారు. జన్మభూమి కమిటీలతో చంద్రబాబు దోపిడీకి పాల్పడ్డారని సజ్జల చెప్పుకొచ్చారు.
ALSO READ: మరోసారి అధికారం.. 49.14శాతం వైసీపీ వైపే మొగ్గు!
చంద్రబాబు వస్తే మళ్లీ దోపిడీ..
చంద్రబాబు వ్యవస్థలను ఎలా మేనేజ్ చేస్తాడన్న విషయాన్ని ‘మహాదోపిడీ’ పుస్తకంలో రచయిత విజయబాబు చక్కగా వివరించారని సజ్జల పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర నిధులను ఎలా దోచేశారో క్లియర్గా చెప్పారు. రాజకీయం అంటే దోపిడీ అన్నట్లుగా చంద్రబాబు వ్యవహరించారన్నారు. అధికారం కోసం చంద్రబాబు.. పవన్, బీజేపీని వాడుకుంటున్నారన్నారు. చంద్రబాబు తొక్కేస్తానంటూ విర్రవీగిన పవన్ కళ్యాణ్ చివరికి తన కార్యకర్తలనే తొక్కేశారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మోసాలు ప్రజలకు అర్థమైనందునే 2019లో టీడీపీని ఓడించారన్నారు. చంద్రబాబు వస్తే మళ్లీ దోపిడీ రాజ్యం వస్తుందని తెలిపారు.
ALSO READ: టార్గెట్ ‘పవన్’.. కాపు ముఖ్యనేతలతో ప్రచారం!
అంతర్జాతీయ స్థాయిలో చెడ్డ పేరు
చంద్రబాబు అవినీతిని వ్యవస్థీకృతం చేశారని, అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు చెడ్డ పేరు తెచ్చారని సజ్జల అన్నారు. వ్యవస్థలను అవినీతిమయం చేయడం, మీడియా ద్వారా ప్రజలను తప్పు దోవ పట్టించడంలో చంద్రబాబు ఆరితేరారన్నారు. చంద్రబాబు అంతటి అవినీతి పరుడు లేరని ప్రధాని సైతం విమర్శించారని గుర్తు చేశారు. ఐఎంజీ స్కాం కూడా అమరావతి స్కాం లాంటిదేనని, రూ.లక్ష పెట్టుబడితో వచ్చిన ఒక కంపెనీకి ఐదు రోజుల్లోనే 400 ఎకరాలను కేటాయించి వేల కోట్ల దోపిడీకి ఆ రోజుల్లోనే చంద్రబాబు ప్లాన్ చేశారన్నారు. ఇలాంటి అవినీతిపరుల విషయంలో ప్రజలే తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
One Comment