తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: టార్గెట్ ‘పవన్’.. కాపు ముఖ్యనేతలతో ప్రచారం!

ఏపీలో ‘పిఠాపురం’ నియోజకవర్గం హాట్ టాపిక్‌గా మారింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించగానే.. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ మేరకు అక్కడి నుంచి వంగా గీతను వైసీపీ రంగంలోకి దింపింది. ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించే దిశగా వ్యూహరచన చేస్తున్నారు.

ALSO READ: టీడీపీ, జనసేన ప్లాన్ ఫెయిల్.. షాక్ ఇచ్చిన ఎన్నికల కమిషన్‌

సుదీర్ఘ చర్చలు..

అధికార వైసీపీ పవన్ ఓటమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే పిఠాపురం జనసేన మాజీ ఇన్ ఛార్జ్ మాకినీడి శేషకుమారిని వైసీపీలో చేర్చుకుంది. పవన్ లక్ష్యంగా సీఎం జగన్ మంత్రులను రంగంలోకి దించుతున్నారు. ఆపరేషన్ పిఠాపురంలో భాగంగా క్యాంపు కార్యాలయంలో కాపునాడు వ్యవస్థాపక అధ్యక్షుడు ముద్రగడ పద్మనాభం, వంగా గీతతోపాటు ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ద్వారంపూడితో పాటు కాపునేతలైన దాడిశెట్టి రాజా, కురసాల కన్నబాబులతో సీఎం జగన్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

ALSO READ: జనసేన పార్టీకి బిగ్ షాక్‌.. పార్టీని వీడుతున్న కీలకనేతలు!

వైసీపీ వ్యూహరచన..

పిఠాపురంలో మరోసారి పట్టు సాధించేందుకు వైసీపీ వ్యూహరచన చేస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పెండెం దొరబాబు శేషకుమారిపై గెలుపొందారు. ఈ సారి పోటీలో ఉన్న వంగా గీతకు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో పెద్దఎత్తున బంధువర్గం ఉంది. తాజా రాజకీయ సమీకరణ నేపథ్యంలో గీతతోపాటు శేషుకుమారి చేరిక, ముద్రగడ రాక.. మరోవైపు టీడీపీకి చెందిన వర్మకు టికెట్ ఇవ్వకపోవడంతో అసంతృప్తి నెలకొంది. ఈ తరుణంలో విజయం ఖాయమని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button