తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Congress: రామమందిర ప్రారంభానికి పోవద్దని ప్రజలకు తాము ఎప్పుడు చెప్పలేదు: పొన్నం

పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కేసీఆర్‌కు అమ్ముడుపోతారన్న బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ కౌంటర్‌ ఇచ్చారు. బండి సంజయ్‌ వ్యాఖ్యలతో బీఆర్‌ఎస్‌, బీజేపీలు ఒకటేనని మరోసారి బయటపడిందన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ రెండుగా చీలి పోతుందని చెప్పారు. మంగళ సూత్రాలు అమ్మిన సంజయ్‌కి ఇప్పుడు లక్షల రూపాయలతో కటౌట్స్ పెట్టుకునే డబ్బులు ఎక్కడివని ప్రశ్నించారు. కరీంనగర్ పార్లమెంటుకు బండి‌సంజయ్ తెచ్చిన నిధులు శూన్యమని పొన్నం విమర్శించారు.

Also Read: హింస, అన్యాయం లేని దేశం కావాలి: రాహుల్ గాంధీ

శాస్త్రం ప్రకారం ప్రాణప్రతిష్ఠ పండితులు చేస్తారని… అయోధ్య దేవాలయం నిర్మాణం ఇంకా పూర్తి కాకుండానే అశాస్త్రీయంగా మందిర ప్రారంభం జరుగుతోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అయోధ్య రామమందిర ప్రారంభానికి పోవద్దని తాము ఎక్కడా చెప్పలేదని… రాముడి పేరుతో బీజేపీ మార్కెటింగ్ చేస్తోందని ఆరోపించారు. రేషన్ బియ్యం తెచ్చి రాములోరి అక్షింతలంటున్నారని… ఎంపీగా బండి‌సంజయ్ కొండగట్టు, వేములవాడ కోసం నిధులు ఏమైనా తీసుకువచ్చాడా..? చెప్పాలని నిలదీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button