తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Gaddar: ట్యాంక్ బండ్ పై గద్దర్ విగ్రహం… సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం

విప్లవ కవి, ప్రజా గాయకుడు గద్దర్ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే గద్దర్ విగ్రహ ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెల్లాపూర్ మున్సిపాలిటీ చేసిన తీర్మానానికి ఆమోదం తెలిపింది. విగ్రహ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read: నిరుద్యోగులకు గుడ్ న్యూస్… టీఎస్ఆర్టీసీలో నోటిఫికేషన్‌కు ప్రభుత్వం కసరత్తు

గతంలో గద్దర్ మరణ వార్త తెలిసిన వెంటనే రేవంత్ రెడ్డి ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన భౌతికకాయాన్ని ఎల్బీ స్టేడియంకు తరలించడం దగ్గర నుంచి అంతిమయాత్ర వరకు ఆయన అన్నింటినీ ముందుండి సీఎం రేవంత్ నడిపించారు. గత ఎన్నికల్లో కూడా గద్దర్ కుమార్తె వెన్నెలకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. అయితే, ఆ ఎన్నికల్లో ఆమె ఓటమిపాలయ్యారు. మరోవైపు, ట్యాంక్ బండ్ పై గద్దర్ విగ్రహం ఏర్పాటు కానుండటంపై ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button