Governor: పేద విద్యార్థులకు ఉచిత ల్యాప్ టాప్లు ఇచ్చిన తమిళిసై
తెలంగాణ గవర్నర్ తమిళిసై పేద విద్యార్థులకు ల్యాప్టాప్లు పంపిణీ చేశారు. ఈ మేరకు హైదరాబాద్లోని రాజ్భవన్లో అక్షయ విద్యా ఫౌండేషన్ వారి సహకారంతో అర్హులైన పేద విద్యార్థులకు ఉచితంగా ల్యాప్ టాప్ లు అందజేశారు. ప్రతి విద్యార్థి చదువుల్లో రాణించాలని కోరారు. కాగా, ల్యాప్టాప్లతో విద్యార్థులు ఆన్లైన్ విద్యను ఆటంకాలు లేకుండా పొందుతారన్నారు. అనంతరం రాజ్ భవన్ ప్రాంగణంలో విద్యార్థినులతో కలిసి ముచ్చటించారు. ఈ మేరకు గవర్నర్తో కలిసి విద్యార్థినులు ఫొటోలతో సందడి చేశారు.
ALSO READ: మేడిగడ్డ కుంగుబాటు.. విజిలెన్స్ విచారణకు సర్కార్ ఆదేశాలు
గొప్ప ప్రయత్నానికి సహకరించాలి..
రాజ్భవన్ ప్రత్యేక చొరవ కింద ‘డొనేట్ డివైజ్’ క్యాంపెయిన్ కింద నిరాశ్రయులైన విద్యార్థులకు ల్యాప్టాప్లు, ట్యాబ్లను పంపిణీ చేసింది. నిరుపేదలకు ఉపయోగపడే పాత ల్యాప్టాప్లు, కొత్త ల్యాప్టాప్లను విరాళంగా అందించే ఈ గొప్ప ప్రయత్నానికి సహకరించాలని కోరారు. మీ మద్దతు మరికొంతమంది విద్యార్థుల ప్రతిభ, కలలను కొనసాగించడంలో తోడ్పాటు ఇస్తుందని పేర్కొన్నారు.