PV Sindhu: ఆసియా టీమ్ చాంపియన్షిప్స్… ఆటగాళ్ల జాబితా ప్రకటన
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మళ్లీ కోర్డులో అడుగుపెట్టనుంది. గాయం కారణంగా ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలిగిన ఆమె ప్రతిష్ఠాత్మక ఆసియా టీమ్ చాంపియన్షిప్స్ లో బరిలోకి దిగనుంది. మలేషియాలో ఫిబ్రవరి 13 నుంచి జరిగే ఈ టోర్నీ కోసం భారత బ్యాడ్మింటన్ సమాఖ్య ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది. మహిళల విభాగానికి సింధు నేతృత్వం వహించనుండగా.. పురుషుల బృందాన్ని స్టార్ ఆటగాళ్లు హెచ్ఎస్ ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్లు నడిపించనున్నారు.
Also Read: మహ్మద్ షమీకి అర్జున అవార్డు… రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరణ
పురుషుల జట్టు : హెచ్ఎస్ ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్, చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్, ద్రువ్ కపిల, అర్జున్, సూరజ్ గోవలా, పృథ్వి రాయ్.
మహిళల జట్టు : పీవీ సింధు, అన్మోల్ ఖార్బ్, తన్వీ శర్మ, అష్మిత చల్హిత, త్రెస్సా జాలీ, గాయత్రి గోపిచంద్, అశ్వినీ పొన్నప్ప, తనీష క్రాస్టో, ప్రియా దేవీ కొంజెంబమ్, శ్రుతి మిశ్రా.