TS BJP: అప్పుల ఊబిలో తెలంగాణ…ఎలా గట్టెక్కిస్తారో చెప్పాలి: బండి సంజయ్
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా డ్రామాలాడుతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. షెడ్యూల్ ప్రకారం వచ్చే మార్చి, ఏప్రిల్ లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయన్నారు. అంతకంటే ముందే ఫిబ్రవరిలోనే ఎన్నికల కోడ్ వచ్చే అవకాశముందని… ఈ విషయం తెలిసి కూడా దరఖాస్తుల ప్రజాపాలన అప్లికేషన్లు కంప్యూటరీకరణ ,క్షేత్రస్థాయి పరిశీలన పేరుతో టైంపాస్ చేస్తుందని ధ్వజమెత్తారు.
Also Read: పేద విద్యార్థులకు ఉచిత ల్యాప్ టాప్లు ఇచ్చిన తమిళిసై
అసలు అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణను ఎలా గట్టెక్కిస్తారో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు . గత 10 ఏళ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు.. రేషన్ కార్డు ప్రాతిపదికగా 6 గ్యారంటీలను అమలు చేస్తామంటే పేదలకు న్యాయం జరిగే అవకాశం లేదన్నారు. కేంద్రంలో మళ్లీ రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రజలంతా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధికంగా బీజేపీ ఎంపీలను గెలిపించాలని కోరారు.
Also Read: సీఈసీతో భేటీ అనంతరం సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు
వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని వెంకటంపల్లి గ్రామానికి వచ్చిన బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఆరు గ్యారంటీల పేరుతో కాలయాపన చేస్తూ డ్రామాలు చేస్తే ప్రజలు హర్షించరనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.