తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

KCR: కేసీఆర్‌తో బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ భేటీ…కలిసి పోటీ చేయనున్నారా?

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మర్యాదపూర్వకంగా క‌లిశారు. బంజారహిల్స్ లోని నంది నగర్ నివాసంలో భేటీ అయ్యారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో భేటీ జరగటం అందరిలో ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన బీఆర్ఎస్, బీఎస్పీ పార్టీలు.. లోక్ సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటాయా అనే చర్చ ప్రజల్లో మొదలైంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కమ్యూనిస్టులు పొత్తుతో ఉన్నారు.. అయితే బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగుతుందని తెలుస్తోంది.

Also Read: దేశాన్ని ఆకర్షించే ఐకానిక్..ఏపీ రాజధానిగా విశాఖ!

కాగా బీఆర్ఎస్ పార్టీ సైతం ఒంటరిగా వెళ్లాలనే ఆలోచన చేస్తున్నా.. కలిసి వచ్చే పార్టీలను సైతం కలుపుకుని పోవాలనే ఉద్దేశంలో ఉందని సమాచారం. ఇలాంటి సమయంలోనే బీఎస్పీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఇంటికి వెళ్లి మరీ కేసీఆర్ తో భేటీ కావటం ఆసక్తిగా మారింది. ఈ స‌మావేశంలో బీఎస్పీ పార్టీ ప్రతినిధుల బృందంతో పాటు హ‌రీశ్‌రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, బాల్క సుమాన్‌తో పాటు ప‌లువురు ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button