London: మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ దృష్టి… థేమ్స్ రివర్ అథారిటీ ప్రతినిధులతో చర్చ
మూసీ నది ప్రక్షాళన పై కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఒకవైపు కాలుష్యాన్ని నిర్మూలించడం, మరోవైపు టూరిజం ప్రాంతంగా తీర్చిదిద్దడంపై ఆలోచిస్తుంది. దావోస్ పర్యటన ముగించుకుని లండన్ చేరిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి థేమ్స్ రివర్ అథారిటీ ప్రతినిధులతోనూ, లండన్ పోర్టు అధికారులతోనూ మూడున్నర గంటల పాటు చర్చలు జరిపారు.
Also Read: చంద్రబాబు మిత్రుడు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అరెస్ట్… టీడీపీ అధ్యక్షుడికి అదే గతి పట్టనుందా?
ప్రస్తుతం థేమ్స్ నదిని పలు విధాలుగా అభివృద్ధి చేసినట్లే భవిష్యత్తులో హైదరాబాద్లోని మూసీ నదిని కూడా డెవలప్ చేయడంపై సహకారం అందించాల్సిందిగా కోరారు. రాష్ట్ర ప్రభుత్వ విజన్ను కూడా వారికి వివరించారు. త్వరలోనే లండన్ నుంచి నిపుణుల బృందం హైదరాబాద్ వచ్చి ప్రక్షాళనకు సంబంధించి ఫీల్డ్ విజిట్ చేయడంతో పాటు ప్లానింగ్ను రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు వివరించనుంది.
Also Read: సిరిసిల్ల చేనేత కార్మికుడికి అరుదైన గౌరవం… రాముడి చెంతకు నేతన్న చీర
థేమ్స్ నదిని ప్రక్షాళన చేసి సుందరంగా తీర్చిదిద్దడానికి పడిన శ్రమను, ప్రస్తుతం దాని నిర్వహణ తీరును సీఎం రేవంత్కు వారు వివరించారు. లండన్ – విజన్ 2050 గురించి కూడా అవగాహన కల్పించారు. మూసీ ప్రక్షాళనతో పాటు భవిష్యత్తులో అది పలు రూపాల్లో ఆదాయాన్ని ఇచ్చే మోడల్గా తీర్చదిద్దడంపైనా ఇరు పక్షాల మధ్య చర్చలు జరిగాయి.