తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Sajjanar: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త… ప్రమాద బీమా పెంపు… ఎంతంటే?

తమ ఉద్యోగులకు ప్రమాద బీమా పెంపుపై యూబీఐతో TSRTC ఒక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం.. 40 లక్షల నుంచి ఒక కోటికి ప్రమాద బీమా పెరిగింది. హైదరాబాద్ లోని బస్ భవన్ లో ప్రమాద బీమా పెంపుపై టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, ఐపీఎస్, యూబీఐ సీజీఎం అండ్ జోనల్ హెడ్ భాస్కర్ రావులు ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు. రోడ్డు ప్రమాదాల్లో అకాల మరణం చెందిన, శాశ్వతంగా దివ్యాంగులైన సిబ్బందికి ఈ ప్రమాద బీమా వర్తించనుంది.

Also Read: ఏపీలో మొదలైన కులగణన.. బీసీలకు ఎంతమేర లాభం?

బీఐ సూప‌ర్ శాల‌రీ సేవింగ్ అకౌంట్(యూఎస్ఎస్ఏ) కింద కోటి రూపాయల ప్రమాద బీమాను అందించనున్నారు. రూపే కార్డు ద్వారా మరో 12 లక్షల వరకు బీమా వర్తిస్తుంది. ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే మొత్తంగా 1.12 కోట్ల వరకు ప్రమాద బీమాను యూబీఐ సహకారంతో బాధిత కుటుంబాలకు సంస్థ అందించనుంది. ఫిబ్రవరి 1 వ తేది నుంచి ఈ ప్రమాద బీమా అమల్లోకి వస్తుంది. ప్రమాద బీమాను పెంచాలని కోరగానే అంగీకరించిన యూబీఐ ఉన్నతాధికారులకు ఎండీ వీసీ సజ్జనార్ కృతజ్ఞతలు తెలియజేశారు.

Also Read: దేశవ్యాప్తంగా స్వచ్ఛ్ మందిర్ అభియాన్.. ఆలయాన్ని శుభ్రం చేసిన గవర్నర్

ప్రమాద బీమా పెంపు అంశాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వాగతించారని, ఇది సిబ్బందికి ఎంతో మేలు చేకూరుస్తుందని అభిప్రాయపడ్డారని చెప్పారు. యూఎస్ఎస్ఏ కింద రోడ్డు ప్రమాదాల్లో మరణించిన 12 మంది సిబ్బంది కుటుంబాలకు ఒక్కొక్కరికి 40 లక్షల చొప్పున అందజేశామని తెలిపారు. గతంలో శాలరీ శ్లాబులతో ప్రమాద బీమా ఇచ్చేవారని, ఈ కొత్త ఒప్పందంలో శాలరీ శ్లాబులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క సిబ్బందికి ఒక కోటి ప్రమాద బీమా వర్తిస్తుందని తెలిపారు. రూపే కార్డు ఉంటే మరో 12 లక్షల బీమా అందుతుందని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button