తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

TS Government: మేడిగడ్డ బ్యారేజీకి మరిన్ని పగుళ్లు..! వీడియో వైరల్

కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో మేడిగడ్డ వద్ద నిర్మించిన కీలకమైన లక్ష్మీ బ్యారేజీ నాణ్యతా లోపాలు బయటపడుతున్నాయి. దాదాపు రూ. 3,652 కోట్లతో నిర్మించిన ఈ బ్యారేజీకి భారీ స్థాయిలో పగుళ్లు వచ్చాయి. ఏడో బ్లాక్‌తోపాటు 6,8 బ్లాక్‌లలో కూడా మరిన్ని పియర్స్‌కు నష్టం వాటిల్లింది. మరో వైపు బ్యారేజీ దిగువన 20 టన్నుల బరువుతో ఉన్న సిమెంట్ బ్లాక్స్ సుమారు 100 మీటర్లు కొట్టుకుపోయాయి. తాజాగా, ఈ పగుళ్లకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవతోంది. కాగా, అంతకుముందు బ్యారేజీ బీ-బ్లాక్‌లో 19, 20, 21వ పిల్లర్ల మధ్య ఉన్న వంతెన సుమారు 30 మీటర్ల పొడవున.. ఒక ఫీటు వరకు కిందికి కుంగినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ALSO READ: బడ్జెట్ పై తెలంగాణ సర్కార్ కసరత్తు.. ఫిబ్రవరి రెండో వారంలో సమావేశాలు?

నిర్మాణ దశలోనే ఆరోపణలు..

మేడిగడ్డ బ్యారేజీని 2016 మే 2వ తేదీ నిర్మాణం చేపట్టగా.. 2019 జూన్‌ 21న దీనిని ప్రారంభించారు. మేడిగడ్డ బ్యారేజీ నిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీలు. ఎల్‌అండ్‌టీ సంస్థ నిర్మించిన ఈ బ్రిడ్జి పైనుంచే మహారాష్ట్రలోని సిరోంచ జిల్లాకు రాకపోకలు కొనసాగుతున్నాయి. వాస్తవానికి నిర్మాణ దశలోనే బ్యారేజీలోని 20వ నెంబరు పిల్లర్‌ వద్ద పగుళ్లు వచ్చాయని, అప్పట్లో దానికి మరమ్మతులు చేసి పని పూర్తి చేశారనే ఆరోపణలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button