IND VS ENG: విజృంభించిన కుల్దీప్.. 8 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్
రాంచీ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మొదట ఓపెనర్ బెన్ డకెట్(10)ను ఔట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఓలీ పోప్(0)ను ఎల్బీగా ఔట్ చేశాడు. ఇక తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో జో రూట్(11) కూడా అశ్విన్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు.
ALSO READ: జురెల్ సెంచరీ మిస్..307 పరుగులకు భారత్ ఆలౌట్
ఇంగ్లాండ్కు కోలుకోలేని దెబ్బ
హాఫ్ సెంచరీతో దూకుడుగా ఆడుతున్న ఓపెనర్ జాక్ క్రాలే(60), కెప్టెన్ బెన్ స్టోక్స్(4)ను కుల్దీప్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లో జడేజా బౌలింగ్లో జానీ బెయిర్స్టో(30) క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో ఇంగ్లాండ్ 120 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. మరోసారి కుల్దీప్ ఇంగ్లాండ్ను తీవ్రంగా దెబ్బ తీశాడు. టామ్ హార్ట్లీ(7), ఒల్లీ రాబిన్సన్(0)లను ఔట్ చేసి ఇంగ్లాండ్కు కోలుకోలేని దెబ్బ తీశాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 8 వికెట్లకు 142 పరుగులు చేసింది. దీంతో 188 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Can you be more specific about the content of your article? After reading it, I still have some doubts. Hope you can help me.