IND vs ENG: జురెల్ సెంచరీ మిస్..307 పరుగులకు భారత్ ఆలౌట్
ఇంగ్లండ్తో రాంచీ వేదికగా జరుగుతున్న 4వ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో భారత్ 307 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ (90 పరుగులు, 149 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేయడంతో భారత్ 300 స్కోర్ దాటింది. చివరి వికెట్ వరకు జురెల్ పోరాడి 90 పరుగుల వద్ద టామ్ హర్ట్లే బౌలింగ్లో అనూహ్యంగా బౌల్డ్ అయి సెంచరీ మిస్ చేసుకున్నాడు. దీంతో ఇంగ్లండ్కు 46 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.
ALSO READ: కుప్పకూలిన టాప్ ఆర్డర్.. కష్టాల్లో భారత్
షోయబ్ బషీర్ ఐదు వికెట్లు..
అంతకుముందు ఓవర్నైట్ స్కోర్ 219/7 తో మూడో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్.. కాసేపటికే కుల్దీప్ యాదవ్(28) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఆకాశ్ దీప్(9) పరుగులు చేశాడు. షోయబ్ బషీర్ బౌలింగ్లో ఎల్బీగా ఆకాశ్ వెనుదిరిగాడు. ఆ వెంటనే జురెల్ కూడా ఔట్ అయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ ఐదు వికెట్లు, టామ్ హార్ట్లీ మూడు వికెట్లు, అండర్సన్ రెండు వికెట్లు పడగొట్టారు.