తెలుగు
te తెలుగు en English
క్రికెట్

IND vs ENG: భారత్‌తో టెస్టు సిరీస్.. హైదరాబాద్ చేరుకున్న ఇంగ్లండ్

భారత్‌తో ఇంగ్లండ్ జ‌ట్టు ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ జనవరి 25 నుంచి హైదరాబాద్‌ వేదికగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు హైద‌రాబాద్‌ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్ర‌యంలో అడుగుపెట్టిన జట్టు సభ్యులకు అధికారులు పూల బొకేల‌తో స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం ప్ర‌త్యేక బ‌స్సుల్లో వారికి కేటాయించిన హోట‌ల్‌కు వెళ్లారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ALSO READ: పుజారా అరుదైన ఘనత.. ఒక్కడే వేల పరుగుల రికార్డ్

ఉప్పల్‌లో ప్రాక్టీస్..

హైదరాబాద్‌కు చేరుకున్న ఇంగ్లండ్ జట్టు నేటి నుంచి ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ప్రాక్టీస్‌ చేయనుంది. అయితే ఆ జట్టు మిడిలార్డర్‌ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ సిరీస్‌ మొత్తానికి దూరం కావడంతో అతడి స్ధానంలో లారెన్స్‌ బరిలోకి దిగనున్నారు. కాగా, భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య చివరిసారిగా 2021-22లో తలపడగా.. ఆ సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది.

భారత జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కేఎల్‌ రాహుల్‌, కేఎస్‌ భరత్‌, దృవ్‌ జురెల్‌, కుల్దీప్‌ యాదవ్‌, ముకేశ్‌ కుమార్‌, మొహమ్మద్‌ సిరాజ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, ఆవేశ్‌ ఖాన్‌.

ఇంగ్లండ్‌ జట్టు: జాక్‌ క్రాలే (కెప్టెన్‌), బెన్‌ డకెట్‌, జో రూట్‌, బెన్‌ స్టోక్స్‌ (కెప్టెన్‌), రెహాన్‌ అహ్మద్‌, జానీ బెయిర్‌స్టో, బెన్‌ ఫోక్స్‌, ఓలీ పోప్‌, జేమ్స్‌ ఆండర్సన్‌, గస్‌ అట్కిన్సన్‌, షోయబ్‌ బషీర్‌, టామ్‌ హార్ట్లీ, జాక్‌ లీచ్‌, ఓలీ రాబిన్సన్‌, మార్క్‌ వుడ్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button