తెలుగు
te తెలుగు en English
మరిన్ని

Esha Singh : ఈషా సింగ్ కు పారిస్ ఒలింపిక్స్ బెర్తు ఖరార్… శుభాకాంక్షలు తెలిపిన కవిత

తెలంగాణకు చెందిన 18 ఏళ్ల ఈషా సింగ్ పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌ను ద‌క్కించుకుంది. జ‌కార్తా వేదిక‌గా జ‌రిగిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫ‌య‌ర్ టోర్న‌మెంట్‌లో మ‌హిళ‌ల 10 మీట‌ర్ల ఎయిర్ పిస్ట‌ల్ విభాగంలో స్వ‌ర్ణ‌ప‌తకాన్ని గెల‌వ‌డం ద్వారా ఆమె విశ్వ‌క్రీడ‌ల‌కు అర్హ‌త సాధించింది. 10 మీట‌ర్ల ఎయిర్ పిస్ట‌ల్ విభాగంలో ఈషా సింగ్ 243.1 స్కోరు చేసి స్వ‌ర్ణం కైవ‌సం చేసుకుంది. పాకిస్తాన్ కు చెందిన కిష్మ‌లా త‌ల‌బ్ (236.3) ర‌జ‌కాన్ని అందుకోగా, భార‌త్‌కు చెందిన రిథ‌మ్ సాంగ్వాన్ (214.5) క్యాంస ప‌త‌కాన్ని ముద్దాడింది. ఒలింపిక్ బెర్తును ఖాయం చేసుకున్న ఈషా సింగ్ పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది.

Also Read: రెండో టీ20లో భారత్ బోల్తా.. సిరీస్ సమం చేసిన ఆసీస్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత సోష‌ల్ మీడియా వేదిక‌గా అభినంద‌న‌లు తెలియ‌జేసింది. పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌ను సొంతం చేసుకున్న తెలంగాణ ముద్దు బిడ్డ ఈషా సింగ్ కు శుభాకాంక్ష‌లు తెలిపింది. జ‌కార్తాలో జ‌రిగిన ఆసియా ఛాంఫియ‌న్ షిప్‌లో స్వ‌ర్ణం గెల‌వ‌డం మీ నైపుణ్యం, సంక‌ల్పానికి నిద‌ర్శ‌నమని… ఒలింపిక్ వేదిక‌పై స‌త్తా చాటాల‌ని కోరుకుంటున్నానని క‌విత ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button