తెలుగు
te తెలుగు en English
టెన్నిస్

Tennis: రన్నరప్ తో సరిపెట్టుకున్న బోపన్న జోడీ

మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా)తో కలిసి అద్భుతమైన ఆటతీరుతో పురుషుల డబుల్స్‌ ఫైనల్‌ చేరిన భారత వెటరన్‌ ఆటగాడు రోహన్‌ బోపన్న చివరకు రన్నరప్‌ టైటిల్‌తో సరిపెట్టుకున్నాడు. తుదిపోరులో బోపన్న- ఎబ్డెన్‌ జోడీ 6-2, 3-6, 4-6 తేడాతో వరుసగా రెండు సార్లు ఛాంపియన్‌ మూడో సీడ్‌ రాజీవ్‌ రామ్‌ (అమెరికా)- జో సాలిస్‌బరి (బ్రిటన్‌) చేతిలో ఓడింది.

తొలి సెట్‌ తొలి గేమ్‌లోనే బ్రేక్‌ సాధించిన బోపన్న జంట విన్నర్లతో సాగిపోయింది. చూస్తుండగానే 3-1తో దూసుకెళ్లింది. ఆ తర్వాతి గేమ్‌లో ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ నిలబెట్టుకుంది. అయినా బోపన్న ద్వయం వరుసగా మూడు గేమ్‌లు గెలిచి సెట్‌ ముగించింది. రెండో సెట్లో పోరు హోరాహోరీగా సాగి.. ఓ దశలో 2-2తో స్కోరు సమమైంది. తర్వాత ప్రత్యర్థి జోడీ ధాటి ముందు బోపన్న జంట నిలవలేకపోయింది. వరుసగా మూడు గేమ్‌లు ఓటమిపాలయ్యారు.

ఇక నిర్ణయాత్మక మూడో సెట్లో రెండు జోడీలు విజయం కోసం గట్టిగా పోరాడాయి. ముఖ్యంగా నాలుగో గేమ్‌లో బ్రేక్‌ పాయింట్‌ కోసం బోపన్న జోడీ, సర్వీస్‌ నిలబెట్టుకోవడం కోసం రామ్‌ జంట పోటాపోటీగా తలపడ్డాయి. చివరకు రామ్‌ ద్వయం ఆ గేమ్‌ గెలిచింది. అయిదో గేమ్‌లో రామ్‌ జంట బ్రేక్‌ సాధించడమే మలుపు. దీంతో 3-2తో ఆధిక్యంలోకి వెళ్లిన ప్రత్యర్థి ద్వయం, అనంతరం సర్వీస్‌ కాపాడుకుని 4-2తో విజయానికి చేరువైంది. అదే జోరులో మ్యాచ్‌ ముగించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button