TajMahal: తాజ్మహల్ను శివాలయంగా ప్రకటించాలని కోర్టులో పిటిషన్
తాజ్ మహల్ను తేజో మహాలయ, హిందూ దేవాలయంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా కోర్టులో తాజాగా పిటిషన్ దాఖలైంది. బుధవారం దాఖలు చేసిన పిటిషన్లో.. తాజ్ మహల్లో ఇస్లామిక్ కార్యకలాపాలను నిలిపివేయాలని, ప్రార్థనా స్థలానికి అనువైన ఇతర పద్ధతులను నిలిపివేయాలని కోరింది. ఈ పిటిషన్ ఏప్రిల్ 9న విచారణకు రానుంది.
ALSO READ: కేరళ సీఎం కూతురిపై ఈడీ కేసు నమోదు
పలుమార్లు పిటిషన్లు దాఖలు
తాజ్మహల్గా గుర్తించబడక ముందే ఈ నిర్మాణానికి చరిత్ర ఉందని న్యాయవాది అజయ్ ప్రతాప్ సింగ్ దావా వేశారు. ఈయన శ్రీ భగవాన్ శ్రీ తేజో మహాదేవ్ పోషకుడిగా, యోగేశ్వర్ శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్ ట్రస్ట్, క్షత్రియ శక్తిపీఠ్ వికాస్ ట్రస్ట్ అధ్యక్షుడిగా ఉన్నారు. పిటిషనర్ తన వాదనకు మద్దతుగా వివిధ చారిత్రక పుస్తకాలను ఉదహరించారు. తాజ్మహల్ను శివాలయంగా ప్రకటించాలని కోరుతూ పలుమార్లు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిలో కొన్ని పిటిషన్లు కొట్టివేయగా, మరికొన్ని పెండింగ్లో ఉన్నాయి.