తన నటనతో సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు ఆ నటుడు. అటూ కోలీవుడ్ ప్రేక్షకులలోనే కాకుండా ఇటూ టాలీవుడ్ లోనూ మంచి ఆధరాభిమానాలు సంపాదించుకున్నాడు. మంచి సినిమాలను టాలీవుడ్ లోనూ రిలీజ్ చేస్తూ ప్రత్యేక అభిమానులను స్వంతం చేసుకున్నాడు. ఇంతకి అతను ఎవరని అనుకుంటున్నారా అతనే హీరో విశాల్.
అందరి హీరోలతో పోలిస్తే హీరో విశాల్ మూవీస్ భిన్నంగా ఉంటాయి. విలక్షణమైన నటనను కనబరుస్తాడు. అందుకే అతన్ని కోలీవుడ్ లో పురచ్చి తలపతి అని పిలుస్తుంటారు. అలాంటి నటుడి నుంచి మరో భిన్నమైన మూవీ మనముందుకి రాబోతుంది. అందులో ఆయన గేటాప్,పాత్ర భిన్నంగా ఉండబోతుందని తెలుస్తుంది. ఆయన చేస్తున్న తాజా చిత్రం మార్క్ ఆంటోని. ఇందులో విశాల్ ద్విపాత్రాభినయం చేశారని తెలుస్తుంది. ఈ మూవీ వినాయక చవితి సందర్బంగా సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించనుంది.
పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను రూపొందుతుంది. మినీ స్టూడియో బ్యానర్పై అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఎస్.వినోద్ కుమార్ నిర్మించారు. ఇక ఈ చిత్రంలో ఓ కీలకమైనపాత్రలో ఎస్.జె.సూర్య నటించారు. విశాల్ కి జోడీగా రీతూ వర్మ కనిపించనుంది. తెలుగు నటుడు సునీల్ .. తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.
సెన్సేషనల్ కంపోజర్ జి.వి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇంతకుముందు రిలీజైన అదరద గుండె అదరద మావా లిరికల్ సాంగ్ అందరినీ మెప్పించింది. ఇప్పుడు ఈ మూవీ నుంచి మరో లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. భువికి తరలిరా వీరభద్రుడా .. మహిమ చూపరా ప్రళయ రుద్రుడా .. అంటూ ఈ సాంగ్ సాగుతుంది. లిరిసిస్ట్ భువన చంద్ర రాసిన లిరిక్స్,హేమచంద్ర వాయిస్ ఈ పాటకు ప్రాణం పోశాయి. ఈ సాంగ్ లో దుష్టులను శిక్షిస్తూ ఉన్న విశాల్ ను చూస్తుంటే మనకి కూడా ఓ భావోద్వేగం వస్తుంది. విశాల్ కోపాన్ని చూస్తుంటే ఆ వీరభద్రుడే దిగి వచ్చాడ అనే విధంగా ఉన్నాడు విశాల్. వీరభద్రుడిని ప్రార్థిస్తూ సాగిన ఈ సాంగ్ వింటుంటే గూస్ బంప్స్ వచ్చేలా ఉంది.