తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Guntur Kaaram: గుంటూరు కారం నుంచి మరో అప్డేట్.. ఏది మనదనుకుందాం అంటూ అమ్మ సాంగ్ రిలీజ్

సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో తల్లికి దూరమైన కొడుకుగా మహేష్ కనిపించి.. కొన్ని సన్నివేశాల్లో తనదైన భావోద్వేగాన్ని పండించాడు.

Also read: Sapta Sagaralu Daati- Side B: ఓటిటిలోకి వచ్చిన సప్త సాగరాలు దాటి- సైడ్ బీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి అమ్మపై వచ్చే ఎమోషనల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఏదీ మనదనుకుంటాం.. ఏదీ కాదనుకుంటాం.. లేని తల రాతని వేతికే మనసుకు ఏమని చెప్తాం.. అంటూ ట్యాగ్ ఇస్తూ సాంగ్ పోస్ట్ చేశారు.

పసి వాడయై వేచి చూస్తుందా బదులే రాని గతం. పగ వాడయై నింద మోస్తుందా ఎదుటే ఉన్న నిజం.. అంటూ సాగిన ఈ పాట హృదయాలను హత్తుకునేలా ఉంది. ఈ పాటకు ‘సరస్వతీ పుత్ర’ రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. విశాల్ మిశ్రా ఆలపించారు. ఈ మూవీ కి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అదిరిపోయే మ్యూజిక్ అందించారు. అందులో భాగంగా వచ్చిన ధమ్ మసాలా, కుర్చీ మడత పెట్టి, అండ్ ఓహ్ మై బేబీ సాంగ్స్ కుర్రకారుకి పిచ్చెక్కించేశాయి.

నిజానికి గుంటూరు కారం సినిమాకు మొదటిరోజు నుండే మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ రికార్డ్ లెవల్లో కలెక్షన్స్ రాబట్టింది. విడుదలైన కేవలం 10 రోజుల్లోనే ఏకంగా రూ.231 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రీజనల్ మూవీస్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

3 Comments

  1. You actually make it seem so easy with your presentation but I find this matter to be actually
    something which I think I would never understand.
    It seems too complex and extremely broad for me. I’m looking forward for your next post, I’ll try to get the hang of
    it!

    Also visit my page … vpn code 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button