Andhra Pradesh: ఏపీలో సామూహిక రాజీనామాలు చేసిన వాలంటీర్లు
ఏపీ రాజకీయాలు మొత్తం కూడా వాలంటీర్లు చుట్టూనే తిరుగుతున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వాలంటీర్లను ఎలెక్షన్స్ విధుల్లో పాల్గొనకూడదంటూ ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. అయినా కొందరు వాలంటీర్లు అధికార పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో, పార్టీ ప్రచారాల్లో పాల్గొంటూ కనిపించారు. దీంతో వాలంటీర్లపై టీడీపీ నేతలు ఈసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నేతలు అధికారులను కోరారు.
Also Read: దారిపొడవునా జనప్రవాహం.. జగన్కు అపూర్వ స్వాగతం!
ఏపీలో వాలంటీర్లు, పెన్షన్ అంశం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో, వాలంటీర్ల సేవలకు ఈసీ బ్రేక్ వేసింది. ఇది ఎన్నికలతో ముడిపడి ఉన్న అంశం కావడంతో అధికార, విపక్షాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, వాలంటీర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మచిలీపట్నం ప్రాంతంలో వందలాది వాలంటీర్లు తమ రాజీనామాలను మునిసిపల్ కమిషనర్ కు సమర్పించారు. వాలంటీర్లు సామూహికంగా తరలిరావడంతో మచిలీపట్నం మున్సిపల్ కమిషనరేట్ లో భారీ కోలాహలం నెలకొంది. తమ సేవలకు రాజకీయాలు ఆపాదిస్తూ కొందరు ఈసీకి ఫిర్యాదు చేయడంతో తాము రాజీనామా చేస్తున్నట్టు వాలంటీర్లు తెలిపారు.
One Comment