AP Elections: ఎన్నికల ప్రచారానికి సిద్ధం.. ఈనెల 27 నుంచి బస్సుయాత్ర
ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ సిద్ధమయ్యారు. ‘మేమంతా సిద్ధం’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను చేపట్టనున్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు. దాదాపు 21రోజులపాటు బస్సు యాత్ర కొనసాగనుంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా కొనసాగనుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు బస్సు యాత్ర కొనసాగనుంది.
ALSO READ: రూట్ మార్చిన బాబు.. తిట్టిన నోటితోనే మోదీపై పొగడ్తల వర్షం!
ప్రతి రోజూ ఒక జిల్లాలో..
ఇప్పటికే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన సీఎం జగన్.. ప్రచార రంగంలో దిగనున్నారు. బస్సుయాత్ర ప్రారంభం నుంచి చివరి వరకు సీఎం జగన్ ప్రజలతోనే ఉండనున్నారు. ప్రజల నుంచి ప్రభుత్వ పనితీరును మరింత మెరుగు పరిచేందుకు ప్రజల అభిప్రాయాలను తీసుకోనున్నారు. సిద్ధం సభలు జరిగిన జిల్లాలు మినహా ప్రతి రోజూ ఒక జిల్లాలో బస్సుయాత్ర నిర్వహించనున్నారు. ఉదయం ఇంటరాక్షన్, మధ్యాహ్నం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
ALSO READ: ఏపీ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది.. ఐదేళ్లలో జగన్ చేసింది ఇదే!
ప్రచారంపై ఆసక్తి..
గత ఎన్నికల్లో విజయ శంఖారావం పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహించి 151 స్థానాలు దక్కించుకున్న సీఎం జగన్.. ఆ సమయంలో ఉత్తరాంధ్ర ఇచ్ఛాపురం నుంచి మొదలుపెట్టి.. రోడ్షోలు, బహిరంగ సభలతో జనాల్లోకి బలంగా దూసుకుపోయారు. ఈ నేపథ్యంలో ఈసారి ఆయన ప్రచార శైలిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా, పోలింగ్ కు మరో 55 రోజులు ఉండడంతో పాలనాపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండానే ఎన్నికల ప్రచార షెడ్యూల్ను వైసీపీ రూపకల్పన చేయనున్నట్లు సమాచారం.
One Comment