తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Government: రాజకీయ పార్టీ వ్యవహరించే తీరు ఇదేనా?

వలంటీర్ల వ్యవస్థను దెబ్బతీయడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుది మోసపూరిత రాజకీయమని, ఒక రాజకీయ పార్టీ వ్యవహరించే తీరు ఇదేనా? అని ప్రశ్నించారు. పేదలకు మేలు చేసే వ్యవస్థ అంటే చంద్రబాబు గిట్టదని, చంద్రబాబు ఒరిజినల్‌ క్యారెక్టర్‌ చూపిస్తున్నారని సజ్జల దుయ్యబట్టారు.

ALSO READ: టీడీపీ కుటిల రాజకీయం.. వలంటీర్లను అడ్డుకునేందుకు కుట్ర!

వృద్ధులను ఇబ్బంది పెడితే ఏమొస్తుంది?

అధికారంలోకి వస్తే ఈ వ్యవస్థలు ఏమీ ఉండవని చంద్రబాబు మేసెజ్‌ ఇచ్చారని సజ్జల అన్నారు. ఒకవేళ వలంటీర్‌ వ్యవస్థ చంద్రబాబు పెడితే 2.5 లక్షల జలగలు తయారయ్యేవని ఎద్దేవా చేశారు. వృద్ధులకు, వికలాంగులను ఇబ్బంది పెడితే మీకు ఏమొస్తుందని, చంద్రబాబు విజ్ఞత కలిగిన రాజకీయ నాయకుడు కాదని సజ్జల ధ్వజమెత్తారు. చంద్రబాబు పార్టీ ఆఫీసులో తయారయ్యే స్క్రిప్టు ప్రకారం నిమ్మగడ్డ రమేష్ వ్యవహరిస్తారని, కపిల్ సిబాల్ లాంటి కోట్లకు కోట్లు తీసుకునే లాయర్లతో కేసులు వేయించారన్నారు.

ALSO READ: వీ లవ్ జగన్.. సీఎంపై సరికొత్త సాంగ్‌ రిలీజ్

మూడో తేదీన పెన్షన్లు అందిస్తాం

పెన్షనర్లు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, సచివాలయ వ్యవస్థ ద్వారా పెన్షన్లు అందజేస్తామని సజ్జల వెల్లడించారు. మూడో తేదీన పెన్షన్లు అందిస్తామని, లబ్ధిదారులు సచివాలయానికి వెళ్లి పెన్షన్లు తీసుకోవాలని సూచించారు. అయితే ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు అందుబాటులో ఉండేలా చేస్తుంది వలంటీర్లే. కానీ సచివాలయ సిబ్బందితో పెన్షన్లు పంపిణీ చేయాలంటూ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. మరి సచివాలయ సిబ్బందిని కూడా జగనే నియమించారు కదా? అని సజ్జల ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button