AP Elections: ఐదోరోజుకు చేరుకున్న ‘బస్సుయాత్ర’.. జననేతకు బ్రహ్మరథం!
వైసీపీ అధినేత వైఎస్ జగన్కు అడుగడుగునా అభిమానులు, నాయకులు, కార్యకర్తలు నీరాజనం పలికారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలుపే లక్ష్యంగా ప్రజాసంకల్పయాత్ర తరహాలో ‘మేమంతా సిద్ధం’ పేరుతో చేపట్టిన బస్సుయాత్రకు ఘన స్వాగతం లభిస్తోంది. ఈ యాత్రతో ప్రజలతో వైఎస్ జగన్ మమేకమవుతున్నారు. ఇక నేటితో మేమంతా సిద్ధం బస్సు యాత్ర 5వ రోజుకు చేరుకుంది. కాగా, సీఎం జగన్ ప్రజల వద్దకు చేరుకోగానే పూల వర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. జనం కోసం నిలబడ్డ నాయకుడికి జననీరాజనం పలుకుతున్నారు.
ALSO READ: రాజకీయ పార్టీ వ్యవహరించే తీరు ఇదేనా?
సత్యసాయి జిల్లాలో కొనసాగుతున్న యాత్ర..
శ్రీసత్యసాయి జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం సంజీవపురం వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస ప్రాంతం నుంచి ఇవాళ ఉదయం 9 గంటలకు తన యాత్రను ప్రారంభించారు. బత్తలపల్లి, రామాపురం, కట్ట కిందపల్లి, రాళ్ల అనంతపురం, ముదిగుబ్బ, ఎన్ఎస్పీ కొట్టాల, మలకవేముల మీదుగా బస్సు యాత్ర పట్నం చేరుకోనుంది. పట్నం నడింపల్లి, కాళసముద్రం, ఎర్ర దొడ్డి మీదుగా కుటాగుళ్లకు చేరుకున్న తర్వాత మధ్యాహ్న భోజన విరామం తీసుకోనున్నారు.
ALSO READ: టీడీపీ కుటిల రాజకీయం.. వలంటీర్లను అడ్డుకునేందుకు కుట్ర!
చీకటిమనిపల్లెలో రాత్రి బస..
వైసీపీ చేపట్టిన ఈ యాత్రకు ఏపీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దారి పొడవునా సీఎం జగన్కు నీరాజనాలు పలుకుతున్నారు. కాగా, ఇవాళ మధ్యాహ్నం కదిరి చేరుకున్న తర్వాత స్థానికంగా ఉన్న పీవీఆర్ ఫంక్షన్ హాల్లో రంజాన్ను పురస్కరించుకుని మైనారిటీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సీఎం జగన్ పాల్గొంటారు. అనంతరం మోటుకపల్లె మీదుగా జోగన్నపేట, ఎస్.ములకలపల్లె, మీదుగా చీకటిమనిపల్లెకు చేరుకుని రాత్రి బస చేయనున్నారు. ఈ మేరకు వైసీపీ నేతలు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
One Comment