AP Politics: జగన్కు అడుగడుగునా నీరాజనాలు..బాబుకు స్పందన కరువు!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర దీబగుంట్లకు చేరుకుంది. బస్సు యాత్రకు మహిళలు, యువకులు బ్రహ్మరథం పట్టారు. ఆయనకు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. అయితే బుధవారం ప్రొద్దుటూరు చేరుకునే మార్గమధ్యంలో వేలాది మంది జనం తరలివచ్చి వైఎస్ జగన్కు స్వాగతం చెప్పారు. కొందరైతే వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న బస్తో పాటు పరుగులు తీస్తూ ఆయనను అభినందించడానికి పోటీ పడ్డారు. మామూలుగా అయితే ఈ దూరం గంటన్నర నుంచి రెండు గంటలలోపు చేరవచ్చు. అలాంటిది సుమారు ఐదారు గంటలు పట్టడం గమనార్హం.
ALSO READ: లంచాలు, వివక్ష లేవు.. అర్హత ఉంటే చాలు!
బాబు సభలు వెలవెల..
‘ప్రజాగళం’ యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన సభలో చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. ప్రజలు రాకపోవడంతో వెలవెల బోయింది. సభా ప్రాంగణం ఖాళీగా ఉండటంతో చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఆ తర్వాత చంద్రబాబు మాట్లాడుతుండగానే సభ నుంచి ప్రజలు వెళ్లిపోయారు. దీంతోపాటు కుప్పంలోనే కాదు పలమనేరులోనూ చంద్రబాబు చెప్పిందే చెప్పి రొటీన్ ప్రసంగంతో ప్రజలకు బోర్ కొట్టించారు. తన గంట ప్రసంగంలో అమలు చేయని హామీలను మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. సభ మధ్యలో పదేపదే చేతులెత్తండి..గట్టిగా చప్పట్లు కొట్టండి అని సూచించినా.. పెద్దగా స్పందన రాలేదు.
ALSO READ: పాలనపై ఫీడ్బ్యాక్.. రెండోరోజు ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి!
చంద్రబాబుకు భయం..
రాష్ట్రంలో వైసీపీ చేపట్టిన ‘సిద్ధం’ సభలకు విశేష స్పందన లభించడంతోపాటు తాజాగా చేస్తున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పథకాల అమలులో అవినీతి, పక్షపాతం లేకపోవడంతో ప్రతీ ఒక్కరూ సీఎం జగన్ పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ మళ్లీ ఆయనే సీఎం అవుతారని బహిరంగంగానే చెబుతున్నారు. కానీ ఈ పరిణామాల నేపథ్యంలో దీంతో చంద్రబాబుకు భయం పట్టుకుందని తెలుస్తోంది.
One Comment