Alliance: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి గడ్డుకాలం.. మొదలైన కొత్త చిచ్చు!
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఆదిలోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పొత్తు తమ అవకాశాలకు తీవ్రంగా గండి కొట్టిందని మూడు పార్టీలకు చెందిన పలువురు సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తిలో రగిలిపోతున్నారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో పొత్తు చిచ్చు పెడుతోంది. సీట్ల సర్దుబాట్లలో భాగంగా ఆ పార్టీ కీలక నేతలకు అవకాశం దక్కకపోవడంతో వారంతా రెబల్స్గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. కొందరు నేతలైతే ఏకంగా స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగి సత్తా చాటుతామని ఇదివరకే ప్రకటించేశారు కూడా. వీరిని బుజ్జగించలేక.. బీజేపీ అధిష్టానానికి చుక్కులు కనిపిస్తున్నాయట. ఈ పరిస్థితి కేవలం బీజేపీలోనే కాదు, అటు టీడీపీ, ఇటు జనసేనలోనూ ఉంది.
ALSO READ: జగన్కు అడుగడుగునా నీరాజనాలు..బాబుకు స్పందన కరువు!
ధర్మవరం, కదిరి, పుట్టపర్తి, రాప్తాడులో రెబల్స్ బెడద
కొన్ని జిల్లాల్లో అయితే ఏకంగా కూటమిలో అగ్గిరాజుకుంటోంది.వీటిలో శ్రీసత్యసాయి జిల్లా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ జిల్లాలోని హిందూపురం పార్లమెంటు సీటుతో పాటు ధర్మవరం, కదిరి, పుట్టపర్తి, రాప్తాడులో రెబల్స్ బెడద కూటమిని గందరగోళానికి గురిచేస్తున్నట్లు సమాచారం. బీజేపీ తరఫున ధర్మవరం టికెట్ ఆశించి భంగపడ్డ వరదాపురం సూరి (గోనుగుంట్ల సూర్యనారాయణ)కి ఎట్టిపరిస్థితిలోనూ తాను కూటమి తరుఫున ప్రచారం చేయనని చెబుతున్నారు. ఈ స్థానాన్ని వై. సత్యకుమార్కు ఖరారు చేయడంతో ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అయితే, తనకు టిక్కెట్ రాకుండా చేయడంలో టీడీపీ అధిష్టానం, ముఖ్యంగా పరిటాల శ్రీరామ్ హస్తం ఉందని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ ఎన్నికల్లో రాప్తాడు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి.. పరిటాల సునీతను ఓడించేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కదిరి టిక్కెట్ ను ఆశించి భంగపడ్డ విష్ణువర్దన్ రెడ్డి సైతం తాను కూటమి తరుఫున ప్రచారం చేయనని చెబుతున్నారు.
175/175 kodatham
122 ysrcp
112 seats pakka ysrcp