CM Jagan: ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రకు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు
వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో ఆయన వెంట నడుస్తున్నారు. ఒక్కో పార్లమెంట్ నియోజక వర్గంలోకి జగన్ బస్సుయాత్ర ప్రవేశిస్తూ ఉంటే ప్రజలు పరవశించి పోతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ గ్రామాలకు జరిగిన అభివృద్ధి గురించి, తమకు కలిగిన లబ్ధి గురించి చెబుతూ జననేత జగన్కు నీరాజనాలు పడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ వైసీపీకే అధికారాన్ని కట్టబెడతామంటూ ప్రజలు నినదిస్తున్నారు.
ALSO READ: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి గడ్డుకాలం.. మొదలైన కొత్త చిచ్చు!
మూడో రోజు షెడ్యూలు
నిన్న నంద్యాలలో కొనసాగిన బస్సుయాత్ర ఇవాళ మూడో రోజు కర్నూల్ పార్లమెంట్ స్థానం పరిధిలో కొనసాగనుంది. పెంచికలపాడు నుంచి ఇప్పటికే యాత్రం ప్రారంభమైంది. పెంచికలపాడు నుంచి రామచంద్రపురం, కోడుమూరు, హంద్రీ కైరవడి, గోనెగండ్ల మీదుగా సీఎం జగన్ రాళ్లదొడ్డికి చేరకుంటారు. రాళ్లదొడ్డికి ముందు మధ్యాహ్నం భోజన విరామం ఉంటుంది. అనంతరం కడిమెట్ల మీదుగా సాగుతూ సాయంత్రం ఎమ్మిగనూరులోని వీవర్స్ కాలనీ సొసైటీ గ్రౌండ్ దగ్గరకు చేరుకుంటారు. సాయంత్రం నాలుగు గంటలకు అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని, ప్రసంగిస్తారు. సభ ముగిశాక.. అరెకల్, ఆదోని క్రాస్, విరుపాపురం,బెణిగేరి,ఆస్పరి, చిన్నహుల్తి మీదుగా యాత్ర మళ్లీ కొనసాగుతుంది. పత్తికొండ బైపాస్ వద్దకు చేరుకున్న అనంతరం ఓ ఫంక్షన్ హాల్ సమీపంలో సీఎం జగన్ రాత్రికి అక్కడే బస చేస్తారు.
2 Comments