YCP: జగన్ బస్సుయాత్రతో కూటమిలో వణుకు!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర ప్రభంజనం సృష్టిస్తోంది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకూ 21 రోజులపాటు కొనసాగనున్న యాత్రకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. యాత్రలో భాగంగా ఇప్పటికే ప్రొద్దుటూరు, నంద్యాలలో నిర్వహించిన భారీ బహిరంగ సభలు సూపర్ సక్సెస్ అవడంతో అదే ఊపుతో ఇవాళ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు భారీ బహిరంగ సభకు వైసీపీ శ్రేణులు సిద్ధమైపోయాయి.
ALSO READ: ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర.. మూడో రోజు షెడ్యూలిదే
వణికిపోతున్న కూటమి!
ప్రతి సభలోనూ ప్రజలు వైసీపీ పట్ల అంతులేని అభిమానం, ప్రేమ చూపుతున్నారు. వైసీపీ తిరిగి అధికారంలోకి రావడం ఎంత ముఖ్యమో జగన్మోహన్ రెడ్డి వివరిస్తూంటే ప్రజలు ముక్తకంఠంతో ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రకు ఉవ్వెత్తున్న వస్తున్న ఈ ఉత్సాహం, ప్రజల మద్దతును చూసి కూటమి నేతల్లో, ముఖ్యంగా చంద్రబాబులో భయం మొదలైపోయిందని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. చంద్రబాబు తన పాలనలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ప్రొద్దుటూరు, నంద్యాల సభల్లో సీఎం జగన్ ఆధారాలతో సహా వివరించడంతో పాటు, అధికారంలోకి వచ్చాక వైసీపీ ఎలాంటి అభివృద్ధి చేసిందో చెబుతూంటే ఓటమి భయంతో టీడీపీ శ్రేణులు గజగజ వణికిపోయాయని వైసీపీ నేతలు చెబుతున్నారు.
ALSO READ: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి గడ్డుకాలం.. మొదలైన కొత్త చిచ్చు!
స్పష్టమైన ప్రణాళికతో దూసుకుపోతున్న జగన్
వై నాట్ 175 MLAs, వై నాట్ 25 MPs దూసుకుపోతున్న వైసీపీ ఈ యాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఐదేళ్లలో రాష్ట్రాభివృద్ధికి తాము ఏం చేశామో వివరించడమే లక్ష్యంగా సీఎం జగన్ ఈ యాత్రను ప్రారంభించారు. మరోసారి వైసీపీకి అధికారాన్ని అప్పగిస్తే ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తారో ప్రజలకు ఒక స్పష్టమైన హామీని ఇవ్వనున్నారు. అంతేకాదు, ఈ యాత్రలో భాగంగా పలువురు మేధావులతో సైతం భేటీ కానున్న జగన్.. వారి సలహాలు, సూచనలు తీసుకుంటూ ముందుకెళ్లనున్నారు.
One Comment