Memantha Siddham Bus Yatra: దేశ చరిత్రలో మహోజ్వల ఘట్టం.. 6వ రోజు షెడ్యూల్ ఇదే!
రాష్ట్రంలో మరోసారి అధికారమే లక్ష్యంగా ‘మేమంతా సిద్ధం’ పేరుతో వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ చేపట్టిన బస్సు యాత్ర ఆరో రోజుకు చేరుకుంది. ఈ యాత్ర ఐదో రోజు సోమవారం సత్యసాయి జిల్లాలో విజయవంతంగా కొనసాగింది. ఉదయం 10.30 గంటలకు బత్తలపల్లి మండలం సంజీవపురంలో మొదలైన యాత్ర ప్రారంభం కాగా, కిలోమీటర్ల కొద్దీ జనం రోడ్డుకు ఇరువైపులా బారులు తీరారు. మండుటెండను కూడా లెక్క చేయకుండా బస్సు వెనుక యువత పరుగులు తీశారు. రోడ్డుపై ఇసుక వేస్తే రాలనంతగా అభిమానులు సీఎం జగన్కు ఘన స్వాగతం పలికారు.
ALSO READ: దారిపొడవునా జనప్రవాహం.. జగన్కు అపూర్వ స్వాగతం!
6వ రోజు షెడ్యూల్ ఇదే!
అన్నమయ్య జిల్లా చీకటి మానుపల్లెలోని విడిది కేంద్రం నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. మొలకల చెరువు, పెద్దపాల్యం, వేపురి కోట మీదుగా బుర్రకాయల కోట క్రాస్, గొల్లపల్లి మీదుగా అంగళ్లకు చేరుకోనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు మదనపల్లెలోని టిప్పు సుల్తాన్ గ్రౌండ్ లో మేమంతా సిద్ధం బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగించనున్నారు. అనంతరం నిమ్మనపల్లి క్రాస్, బోయకొండ క్రాస్, చౌడేపల్లి, సోమల మీదుగా పుంగనూరు నియోజకవర్గం అమ్మగారిపల్లె చేరుకోనున్నారు.. అమ్మగారిపల్లె శివారులో ఏర్పాటు చేసిన విడిది కేంద్రం దగ్గర రాత్రి బస చేయనున్నారు.
ALSO READ: మరోసారి కవ్వింపు చర్యలకు దిగిన చైనా.. నాలుగో లిస్ట్ విడుదల
అన్నమయ్య జిల్లా సిద్ధమా…?
మేమంతా సిద్ధం బస్ యాత్రకు అన్నమయ్య జిల్లా సిద్ధమా…? అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అన్నమయ్య జిల్లాలోకి ప్రవేశించనున్న ఈ యాత్ర.. సుమారు 40 కిలోమీటర్లు మేర కొనసాగనుంది. కాగా, ఐదోరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో కొనసాగిన సీఎం జగన్ బస్సు యాత్రకు ప్రజల బ్రహ్మరథం పట్టారు. అనంతలోనూ సూపర్ సక్సెస్ అయ్యిందంటూ వైసీపీ నేతలు ఫుల్ జోష్లో ఉన్నారు. అయితే ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర దేశ చరిత్రలో మహోజ్వల ఘట్టంగా నిలుస్తుందని పరిశీలకులు చెబుతున్నారు.
2 Comments