YCP: భారీగా పడిపోతున్న టీడీపీ గ్రాఫ్!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి అధికార, ప్రతిపక్ష టీడీపీ కూటమిల మధ్య బహుముఖ పోటీ ఉంటుందని కొందరు చెబుతున్నా.. వైసీపీ నేతలు మాత్రం ఆ మాటల్ని కొట్టిపారేస్తున్నారు. ఈసారి వార్ వన్ సైడేనని, 130కి పైగా స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ విజయం సాధించి, అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వాస్తవ పరిస్థితులు కూడా ఇందుకు అనుకూలంగానే ఉన్నాయి. రోజులు గడుస్తున్నకొద్దీ టీడీపీ గ్రాఫ్ భారీగా పడిపోతోంది.
ALSO READ: వైఎస్సార్సీపీ మేనిఫెస్టోకు సర్వజనామోదం!
చంద్రబాబు అబద్ధపు హామీలు
ముఖ్యంగా వైసీపీ మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత రాష్ట్ర ప్రజలంతా ఆ మేనిఫెస్టో పట్ల తీవ్ర సంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏం చేస్తే తమ జీవితాలు మెరుగుపడతాయని పేదలు భావించారో సీఎం జగన్ వాటినే తమ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. చంద్రబాబు లాగా మోసపూరిత వాగ్దానాలు, అబద్ధపు హామీలు ఇవ్వలేదు. సంక్షేమ పథకాల విషయంలో, ఉచితాల విషయంలో చంద్రబాబు అడ్డగోలు హామీలు ఇస్తున్నారు. ఉచితంగా సిలిండర్లు ఇస్తామని, మహిళలకు నెలకు రూ. 2000 ఇస్తామని ఆచరణకు సాధ్యం కాని ఏవేవో విషయాలను చెబుతున్నారు. అయితే ఆయన ఎన్ని చెప్పినా.. ఆయన మాటలపై మెజారిటీ ప్రజల్లో నమ్మకం లేదు. ఆయన అబద్ధాలు చెబుతారు, అధికారం కోసం ఏదైనా చేస్తానంటారనేది ప్రజలకు బాగా అర్థమైపోయింది.
ALSO READ: గత పథకాలకు మళ్లీ చోటు.. మేనిఫెస్టోను విడుదల చేసిన జగన్!
చంద్రబాబు వస్తే పెన్షన్లు ఉంటాయ?
ముఖ్యంగా పెన్షన్ల, వాలంటీర్ల విషయంలో చంద్రబాబు అండ్ బ్యాచ్ చేసిన కుయుక్తులు, ఆయన అధికారంలోకి వస్తే అసలు పెన్షన్ల పథకాన్ని ఉంచుతారో లేదోనన్న విషయంపై కూడా ప్రజలకు అనుమానాలున్నాయి. ఈ విషయంలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు చంద్రబాబుపై అప నమ్మకంతోనే ఉన్నారు. దీనిపై చంద్రబాబు చివరకు ఎన్ని చెప్పినా, తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు ఏకంగా నెలకు రూ. 10 వేలు ఇస్తామని చెప్పినా ఎవరూ నమ్మడం లేదు. అంతేకాదు, మహిళలకు నెలకు రూ. 2000 ఇస్తామని చెబుతున్న చంద్రబాబు.. గతంలో పసుపు-కుంకుమ పేరుతో మహిళలకు నెలకు రూ. పది వేలు ఇస్తానని చెప్పి, మోసం చేసిన సంగతిని కూడా రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.
2 Comments