తెలుగు
te తెలుగు en English
జాతీయం

Akhilesh Yadav: రామమందిర ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానం అందలేదు: అఖిలేష్ యాదవ్

ఈ నెల 22న అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి తనకు ఇప్పటి వరకు ఆహ్వానం అందలేదని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు వ్యక్తిగతంగా లేదా కొరియర్ ద్వారా… ఏ రూపంలోనూ ఆహ్వానం రాలేదన్నారు. ఒకవేళ తనకు పోస్ట్ ద్వారా పంపినట్లు ఉంటే ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు.

Also Read: రాజకీయ పార్టీలో వన్ మ్యాన్ షో… రాచరిక వ్యవస్థకు దారి తీస్తుంది: లక్ష్మీనారాయణ

తనను ఆహ్వానించకుండా వారు అవమానించారని అఖిలేష్ మండిపడ్డారు. పోస్టల్ ద్వారా పంపించి ఉంటారని ఓ మీడియా ప్రతినిధి చెప్పగా… అలా పంపిస్తే ఆధారాలు చూపించాలన్నారు. ఒకవేళ తన చిరునామాకే పంపించారా? చూడాలన్నారు.

Also Read: కాలారామ్ మందిరంలో రాములవారి భజన చేసిన మోదీ

శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ వేడుకకు అఖిలేష్ యాదవ్‌కు ఆహ్వానించారా? అని విశ్వహిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్‌ను మీడియా ప్రశ్నించింది. ఆయనకు ఆహ్వానం అందిందో లేదో తాను ఎలా ధృవీకరించానని… ఆహ్వానితుల జాబితాలో మాత్రం అఖిలేష్ పేరు ఉందని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button