vijayawada: రాజకీయ పార్టీలో వన్ మ్యాన్ షో… రాచరిక వ్యవస్థకు దారి తీస్తుంది: లక్ష్మీనారాయణ
జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని ఎప్పుడో ఓడించారని, కానీ, ప్రాంతీయ పార్టీలు ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోకుండా బీజేపీతో చెలిమి చేస్తున్నాయని విమర్శించారు. మతోన్మాద పార్టీలను గద్దె దింపాల్సిన అవసరం ఉందని అన్నారు.
Also Read: కాంగ్రెస్కు ప్రజలంటే రాజకీయం, బీఆర్ఎస్కు బాధ్యత: హరీశ్ రావు
రాబోయే ఎన్నికల్లో రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేసే నాయకుడినే ఎన్నుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీలో వన్ మ్యాన్ షో ఉంటే అనంతరం ఆ పరిణామాలు రాచరిక వ్యవస్థకు దారి తీస్తాయని హెచ్చరించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఈనెల 19న ప్రారంభించడం మంచిదన్నారు. ‘నా విగ్రహాల కన్నా.. నా పుస్తకాలతో నన్ను గుర్తించండి’ అని అంబేద్కర్ చెప్పిన మాటలను గుర్తు చేశారు.
Also Read: కాలారామ్ మందిరంలో రాములవారి భజన చేసిన మోదీ
గతంలో కేంద్రాన్ని నిలదీసేందుకు ప్రాంతీయ పార్టీలకు నాలుగు పర్యాయాలు అవకాశం లభించినా, నేతలు తమ స్వార్థం కోసం కేంద్రం కాళ్ల మీద పడిన సందర్భాలు ఉన్నాయని లక్ష్మీనారాయణ విమర్శించారు. ప్రాంతీయ పార్టీల వైఖరి చూస్తుంటే, ప్రత్యేక హోదా అంశానికి ముగింపు పలికినట్టే ఉందని అన్నారు. ప్రత్యేక హోదా అనేది నినాదంగానే మిగిలిపోకూడదని, ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించి సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ పోరాటానికి జై భారత్ నేషనల్ పార్టీ అండగా ఉంటుందని లక్ష్మీనారాయణ తెలిపారు.