BJP: ఫోన్ ట్యాపింగ్పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మరోసారి స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ వెనుక ఎంత పెద్ద నేతలున్నా విడిచిపెట్టొద్దని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఎవరినీ నమ్మలేదని.. అందుకే రాజకీయ, మీడియా ప్రముఖులపై ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డి స్పందించి దీనిపై సీబీఐ విచారణ చేయించాలని సూచించారు.
ALSO READ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తో సీఎం రేవంత్రెడ్డి భేటీ
ఫోన్ ట్యాపింగ్ ఒక్కటే కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎన్నో స్కాంలు జరిగాయని ఆరోపించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, దళితబంధు వంటి పథకాల్లో ఆ పార్టీ నేతలు ఎన్నో అవకతవకలకు పాల్పడ్డారని అన్నారు. వీటిన్నిటిపై సీబీఐ దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల్లో ఆ కుటుంబానికి ప్రమేయముందని అన్నారు.
One Comment