Congress: కాంగ్రెస్ మేనిఫెస్టో.. రైతులకు హస్తం పార్టీ వింత హామీ
తెలంగాణ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను ఇదివరకే ప్రకటించింది. తాజాగా శుక్రవారం అభయహస్తం పేరుతో కాంగ్రెస్ పూర్తిస్థాయి మేనిఫెస్టోను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే విడుదల చేశారు. మేనిఫెస్టోలో బడుగు, బలహీన, గిరిజన, మైనార్టీ.. ఇలా అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా ఎన్నికల హమీలను పొందుపరిచారు.
Read also: Police: రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. కేసు నమోదు చేసిన పోలీసులు
అయితే ఎన్నికల హమీల్లో రైతులకు కాంగ్రెస్ పార్టీ ఓ వింత హామీ ఇచ్చింది. అదేంటో తెలిస్తే కొంచెం నవ్వుకున్నా.. పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. అదే కోతుల సమస్యను పరిష్కరిస్తామని హమీఇచ్చింది.
తెలంగాణ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కోతుల సమస్య చాలా తీవ్రంగా ఉంది. అడపాదడపా స్థానిక గ్రామ పంచాయతీలు వాటి బెడదను తగ్గించేందుకు ప్రయత్నించినా.. అవి ఫలితాన్ని ఇవ్వడం లేదు. దీంతో ఎన్నికల ప్రచారానికి వచ్చిన నేతలను ఆయా గ్రామాల ప్రజలు, రైతులు నిలదీస్తున్నారు. కోతుల సమస్య పరిష్కరించిన వారికే తమ ఓట్లు వేస్తామని షరతులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో కోతుల సమస్యను తీర్చుతామని హామీ ఇచ్చింది. అలాగే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కోతుల స్టెరిలైజ్ (సంతాన నిరోధక) కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు.