Police: రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. కేసు నమోదు చేసిన పోలీసులు
గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ పై మంగళహట్ పోలీసులు కేసు నమోదు చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని ఆయనపై కేసు నమోదైంది. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 14న ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. దీంతో ఎస్సై షేక్ అస్లాం ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేశామని సీఐ రవికుమార్ తెలిపారు.
Read also: Congress: ‘అభయహస్తం’ పేరుతో కాంగ్రెస్ మేనిఫెస్టో.. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయం
అయితే.. ఈ నెల 30న జరిగే ఎన్నికలు తనకు రాజకీయంగా జీవన్మరణం లాంటివని రాజాసింగ్ కార్యకర్తల సమావేశంలో పేర్కొన్న వీడియో వైరల్ అవుతోంది. రాజకీయంగా తనకు శత్రువులు ఎక్కువని, తీవ్రవాద శక్తులను ప్రోత్సహిస్తున్న పార్టీలను తరిమికొట్టాల్సిందే అన్నారు. తనను ఓడించేందుకు గోషామహల్లో మాత్రమే కాదని, ప్రపంచంలోని ముస్లిం ప్రముఖులూ ప్రయత్నిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందుకు పెద్దసంఖ్యలో నిధులు సమీకరిస్తున్నారని.. తన ఓటమి కోసం శత్రువులతో చేతులు కలిపే శక్తులపై నిఘా ఉంచానని, ఎన్నికల తర్వాత వారి భరతం పడతానన్నారు.