తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Hyderabad: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఫోన్ కాల్స్… రంగంలోకి పోలీసులు

తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. శ్రీరామ శోభాయాత్ర నిర్వహిస్తే చంపేస్తామని ఫోన్ చేసి బెదిరించారు. ఈ ఫోన్ కాల్స్ పట్ల రాజాసింగ్ దీటుగా స్పందించారు. ఫోన్ లో బెదిరించడం కాదు… దమ్ముంటే నేరుగా వచ్చి తనను ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. ఈ మేరకు రాజాసింగ్ వీడియో విడుదల చేశారు. ఈ నెల 22న అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో బెదిరింపులు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read: కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

రాజాసింగ్ కు గతంలోనూ బెదిరింపు కాల్స్ వచ్చాయి. బెదిరింపులపై అప్పటి డీజీపీ అంజనీ కుమార్‌కి ఆయన లేఖ కూడా రాశారు. అంతేకాదు, తనకు పాకిస్థాన్ నుంచి కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని రాజాసింగ్ వెల్లడించారు. గుర్తుతెలియని ఫోన్ నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. 7199942827, 42235322270 నంబర్స్ నుంచి కాల్స్ వచ్చినట్లు రాజా సింగ్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button