Ultimate Kho-Kho: అల్టిమేట్ ఖో-ఖో విజేత గుజరాత్.. ప్రైజ్మనీ ఎంతంటే..?
అల్టిమేట్ ఖో-ఖో రెండో సీజన్ ముగిసింది. ఈ లీగ్లో మొత్తం ఆరు జట్లు బరిలోకి దిగగా.. చివరికి గుజరాత్ జెయింట్స్ చాంపియన్గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో చెన్నై క్విక్ గన్స్పై గుజరాత్ 31-26 తేడాతో గెలుపొందింది. కాగా, అంతకుముందు లీగ్ దశలో చెన్నై చేతిలో గుజరాత్ దారుణంగా ఓడిన సంగతి తెలిసిందే. అయితే ఫైనల్లో మాత్రం చెన్నైపై అదరగొట్టింది. ఇక గుజరాత్ జట్టును గెలిపించడంతో కీలక పాత్ర వహించిన సంకేత్ కడామ్ ‘బెస్ట్ అటాకర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. అదే విధంగా విజయ్ షిండే ‘బెస్ట్ డిఫెండర్ మెడల్’, సుయాశ్ గర్గాటేకు ‘అల్టిమేట్ ఖో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’ లభించింది.
ALSO READ: డారిల్ మిచెల్ విధ్వంసం… న్యూజిలాండ్ చేతిలో పాకిస్తాన్ ఓటమి
రూ. కోటి ప్రైజ్మనీ..
గుజరాత్ జట్టు విజేతగా నిలవడంతో ట్రోఫీతో పాటు రూ. కోటి ప్రైజ్మనీ గెలుచుకుంది. అలాగే రన్నరప్ చెన్నై జట్టుకు రూ.50 లక్షలు అందించగా.. మూడో స్థానంలో ఉన్న ఒడిశాకు రూ. 30 లక్షలు ఇచ్చారు. మూడో స్థానం కోసం జరిగిన పోరులో తెలుగు యోధాస్పై ఒడిశా జగ్గర్నాట్స్ 32-24తో భారీ విజయం సాధించింది.