KTR: యూట్యూబ్ చానళ్లపై కేటీఆర్ ఆగ్రహం… కారణం?
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొన్ని యూట్యూబ్ చానళ్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన కొన్ని యూట్యూబ్ చానళ్లు ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా అసత్యాలను పదేపదే ప్రసారం చేస్తున్నాయని మండిపడ్డారు. గుడ్డిగా వ్యతిరేకించడం వలనో, లేక, అధికార పార్టీ ఇచ్చే డబ్బులకు ఆశపడో ఇలాంటి నేరపూరితమైన, చట్టవిరుద్ధమైన వీడియోలను, ఫేక్ న్యూస్ లను ప్రచారం చేస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు.
Also Read: బయటపడిన చంద్రబాబు భారీ కుట్ర!
గతంలోనూ ఇలాగే అసత్యప్రచారాలు, అవాస్తవాలను ప్రచారం చేసిన, ప్రచురించిన మీడియా సంస్థలపై కూడా న్యాయపరమైన చర్యలు ప్రారంభించామని వెల్లడించారు. ప్రస్తుతం కొన్ని యూట్యూబ్ చానళ్లు చేస్తున్న ఈ దుర్మార్గమైన, కుట్రపూరిత చర్యలను చట్టబద్ధంగా ఎదుర్కొంటామని తెలిపారు. దుష్ప్రచారం చేస్తున్న యూట్యూబ్ చానళ్లపై పరువు నష్టం కేసులతో పాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు.
Also Read: రష్యా ఉగ్రదాడిలో పెరుగుతున్న మృతుల సంఖ్య.. ఆగ్రహం వ్యక్తం చేసిన పుతిన్
దీంతో పాటు, ఆయా యూట్యూబ్ చానళ్లను నిషేధించాలని యూట్యూబ్ కు అధికారికంగా ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తూనే, కుట్రపూరితంగా వ్యవహారం నడిపే యూట్యూబ్ చానళ్లు చట్టప్రకారం తగిన శిక్షకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు.