తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

KTR: ‘నన్ను పిచ్చోడిని చేసిర్రు.. కాళ్లు పట్టుకున్న పార్టీలోకి రానీయ్యం’

ఎంపీ రంజిత్ రెడ్డీ, మాజీ మంత్రి పట్నం మహేందర్ పార్టీ మారేది లేదని తనతో చెప్పారని, అప్పుడు వాళ్ల మాటలు పిచ్చివాడిలా నమ్మానని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కానీ, 15 రోజుల్లో జెండా మార్చారని.. రంజిత్​ రెడ్డి, మహేందర్​ రెడ్డి ఆస్కార్ లెవల్లో నటించారని ఎద్దేవా చేశారు.​ తెలంగాణ భవన్ ​లో చేవెళ్ల పార్లమెంట్ సన్నాహక స‌మావేశంలో కేటీఆర్ ​మాట్లాడారు. ‘ఇంటి దొంగ‌ను ఈశ్వరుడు కూడా ప‌ట్టలేడు.

Also read: Bill Gates: ప్రధానితో మోడీతో బిల్‌గేట్ భేటీ.. AI గురించి ముచ్చట్లు

కవిత అరెస్ట్ అయిన రోజు నవ్వుకుంటూ కాంగ్రెస్​ లోకి పోయిన రంజిత్ రెడ్డి.. పట్నం మహేందర్ రెడ్డిపైన పగ తీర్చుకోవల్సిన అవసరం ఉన్నది. వాళ్లు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా మళ్లీ బీఆర్ఎస్ ​లోకి రానీయ్యం. కేకే, కడియంలాంటి నాయకులు పార్టీ కష్టకాలంలో వదిలిపెట్టి వెళ్తున్నరు. కొందరు కొన్ని రాళ్లు వేసి పోతరు. వారి విమర్శలపైన వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్న. కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది. ఈరోజు నాయకులు పార్టీని వదిలేసినా..పార్టీ శ్రేణుల కోసం నేను స్వయంగా పనిచేస్త. వచ్చే 13న జరిగే చేవెళ్ల పార్లమెంట్ మీటింగ్ కు ప్రతి ఒక్కరూ తరలిరావాలి’ అని పిలుపునిచ్చారు.

‘సీఎం రేవంత్ రెడ్డి లీకువీరుడుగా మారిండు. రైతులకు రుణమాఫీ, 4 వేల పింఛన్లు, 2500 మహిళలకు, అందరికీ ఉచిత కరెంటు ఇలాంటి అన్ని హామీలు తుంగలో తొక్కిన్రు. ఆరు గ్యారంటీలు పోయినవి, ఆరు గారఢీలు మిగిలినవి. రేవంత్ ఐదేండ్లు ప్రభుత్వంలో ఉండు. కాంగ్రెస్​420 హామీలు నెరవేర్చు. నీకు నల్లగొండ, ఖమ్మం నాయకులే మానవబాంబులైతరు’ అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button