తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Minister Ponnam: తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం టీజీ.. రేపటి నుంచే అమలు

టీజీ పదంలో తెలంగాణ ఆత్మగౌరవం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హన్మకొండ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో మంత్రి మాట్లాడారు. ఉద్యమ సమయంలో వాహనాల నెంబర్ ప్లేట్లపై ఏపీ బదులుగా టీజీగా రాసుకున్నామన్నారు. జూన్ 2న రాష్ట్రం విడిపోయే సమయంలో టీజీ అని గెజిట్ ఇస్తే.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దానిని టీఎస్ గా మార్చిందన్నారు. ఇక శుక్రవారం నుంచి ప్రతి బండి టీజీ అని రిజిస్ట్రేషన్ అవుతుందని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.

Also read: ECI: ఉత్కంఠకు తెర.. ఎల్లుండే లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్?

మరోవైపు ప్రమాదాలు జరగకుండా హెవీ వెహికల్స్ డ్రైవర్లకు మరోసారి ఫిట్ నెస్ టెస్టులు చేస్తామని తెలిపారు. ఆర్టీసీ పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం వెల్లడించారు. ఎలాంటి భారం లేకుండా ఆర్టీసీ నడుస్తోందని.. సంస్థను బలోపేతం చేసేందుకు త్వరలోనే ఉద్యోగ నియామకాలు చేపడతామని మంత్రి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button