తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

TS Elections: బీఆర్ఎస్‌తో బీజేపీ పొత్తు.. బండి సంజయ్ ఏమన్నారంటే?

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ఫీవర్ మొదలైంది. అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడంపై ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి. అయితే శాసనసభ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌తోపాటు అనూహ్య ఓటింగ్ శాతాన్ని నమోదు చేసుకున్న బీజేపీ కూడా ఈసారి తెలంగాణలోకి 17 పార్లమెంట్ స్థానాలపై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. అయితే ఈ తరుణంలో బీఆర్ఎస్, బీజేపీ పొత్తుపై వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పందించారు.

ALSO READ: టైమ్స్ నౌ సర్వే.. మళ్లీ ఆ పార్టీదే హవా

బీజేపీ ఒంటరిగానే పోటీ..

లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్‌‌తో ఎలాంటి పొత్తు ఉండదని బండి సంజయ్ తేల్చి చెప్పారు. బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకునే ఆలోచనే లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉంటుందన్న బీఆర్ఎస్ నేతల ప్రచారం అవాస్తవమని చెప్పారు. ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పే ధైర్యం కూడా బీఆర్ఎస్ పార్టీకి లేదని బండి ఎద్దేవా చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ నేతలు కావాలనే ప్రజలను మభ్య పెడుతున్నారని ఆగ్రహం వ్యకతం చేశారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీది మూడవ స్థానమేనని జోస్యం చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button