పోల్స్
అంగన్ వాడీలపై ఎస్మా చట్టం ప్రయోగించడం సమంజసమేనా?
ఆంధ్రప్రదేశ్ లో సమ్మె చేస్తున్న అంగన్ వాడీలపై జగన్ సర్కారు ఉక్కుపాదం మోపింది. ఎస్మా చట్టం ప్రయోగించింది. అంగన్ వాడీలను ఎమర్జెన్సీ సర్వీసులలోకి చేర్చి, ఆరు నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేధమంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు జీవో నెం.2 విడుదల చేసింది. గడిచిన 26 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనాల్లోనూ ప్రభుత్వం కోత విధించింది. 10 వేల వేతనం స్థానంలో ప్రభుత్వం ఈ నెల 8050 రూపాయలు మాత్రమే జమ చేసింది.