Hardik Pandya: అవమానించేవారిని పట్టించుకోవద్దు.. పాండ్యాకు మాజీ క్రికెటర్ సలహా
ఐపీఎల్ 2024 టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ టీంకు కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఆడిన తొలి మ్యాచ్లో ముంబై ఓటమిని చవిచూసింది. నరేంద్ర మోడీ స్టేడియంలో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు మధ్య జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే బుమ్రా స్థానంలో హార్ధిక్ మొదటి ఓవర్ వేయడానికి రెడీ అయ్యాడు. ఈ నిర్ణయాన్ని సీనియర్ క్రీడాకారులు సైతం తప్పుబట్టారు.
ALSO READ: రాకెట్ను నేలకేసి కొట్టిన పీవీ సింధు… ఎల్లో కార్డు జారీ
ఒత్తిడికి లోనయ్యే అవకాశం!
ముంబై మ్యాచ్లో ఎప్పుడూ వలయం లోపల ఫీల్డింగ్ చేసే రోహిత్ను బౌండరీ వద్ద పెట్టడం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది. భారత స్టార్ ప్లేయర్ అయి ఉండి ఇండియాలోనే ఇలా అభిమానులచే అవమానం ఎదుర్కోవడం హార్దిక్ను కచ్చితంగా ఉక్కిరిబిక్కిరి చేసి ఉంటుంది. గతంలో అతడికి ఇలాంటి అనుభవం లేదు. కావున ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుందని ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ అన్నాడు. ఉద్దేశపూర్వకంగా అవమానించేవారిని పట్టించుకోకుండా.. ముందుకు సాగడమే ఉత్తమమని హార్దిక్ పాండ్యాకు సలహా ఇచ్చాడు.