ICC: అదరగొట్టిన భారత్.. ఐసీసీ ర్యాంకుల్లో నంబర్ వన్
క్రికెట్లో భారత్ అదరగొడుతోంది. స్వదేశంలో ఇంగ్లండ్ను చిత్తుగా ఓడించిన భారత్.. టెస్టు ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరింది. తాజాగా, ఐసీసీ వెల్లడించిన ర్యాంకుల్లో మూడు ఫార్మాట్లలో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. 122 రేటింగ్ పాయింట్లతో నంబర్ వన్ ర్యాంకు కైవసం చేసుకోగా.. 117 రేటింగ్ పాయింట్స్తో ఆస్ట్రేలియా రెండో స్థానానికి పడిపోయింది. ఇక, ఇంగ్లండ్ 111 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.
ALSO READ: గుడ్ న్యూస్ చెప్పిన బీసీసీఐ.. ఒక్కో మ్యాచ్కు 45 లక్షలు పెంపు
అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానం
రోహిత్ సేన సారథ్యంలో భారత్ 4-1తో ఇంగ్లండ్ను చిత్తు చేసి సిరీస్ కైవసం చేసుకుంది. తద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ పట్టికలో అగ్రస్థానం దక్కించుకుంది. కాగా, టెస్టుల్లో 122, వన్డేల్లో 121, టీ20ల్లో 266 పాయింట్లతో భారత్ అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానంలో ఉంది.
One Comment